రచయితలు
మా పత్రికలో రచనలు అందిస్తున్న ప్రతిభావంతులైన రచయితలు

డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి
సుమారు నాలుగున్నర దశాబ్దాల పాత్రికేయ అనుభవం. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలలో సంపాదక విభాగంలో సేవలు అందించారు. ప్రస్తుతం ‘జాగృతి’ తెలుగు జాతీయవార పత్రిక సంపాదకమండలి సలహాదారుగా సేవలు అందిస్తున్నారు.
యం.వి.రామారావు
ఉదయం,వార్త,ఆంధ్ర జ్యోతి పత్రికల్లో సంపాదకవర్గంలో పని చేసారు. ప్రస్తుతం రాజకీయ,సామాజిక,సాహిత్య,ఆధ్యాత్మిక విశ్లేషకులుగా పలు పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు.
ఎం.వి. రమేష్
కోస్తావాణి, వార్త, గ్రేటర్ న్యూస్ పత్రికలలో ఉపసంపాదకులుగా పనిచేశారు. అనేక రాజకీయ ,ఆధ్యాత్మిక, సాహిత్య విశ్లేషణలతో పాటు వ్యాసాలు రచించారు
డా. ఎమ్మెస్వీ సత్యనారాయణ బాబు (కపర్ది)
ఆంధ్రపత్రిక, ఉదయం, ఆంధ్రభూమి, వనితా జ్యోతి, డెక్కన్ క్రానికల్, కోస్తా ప్రభ, పల్లెబాట, వార్త దినపత్రిక ఉపసంపాదకులుగా పనిచేసిన అనుభవం. తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు నాటకరంగ విజ్ఞాన సర్వస్వం రచయితలలో ఒకరు. గోసేవకులు.
కూచిమంచి పద్మావతి
ఆంధ్రప్రభ,ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఉప సంపాదకురాలిగా పని చేశారు . తెలుగులో అనేక రచనలు చేశారు.
